"మనవి” లోని ఈ మాటలు మనవి! మనకే ఉద్దేశింప బడినవి. మనమనగా జీవులము. జీర్ణోద్ధరణకై వాసుదేవ సేవయే కృ కర్తవ్యమని ఎందరో మహానుభావులు ఉపదేశించినారు.
శ్రీ విష్ణు సహస్రనామ వైశిష్ట్యము
“హరిః పరతరః” అని శ్రీ మధ్వాచార్యులు పేర్కొనిరి. ఆ హరియొక్క నామములను జపించుటే జీవోద్ధరణకు కలియుగములో సులభమైన మార్గము, “శ్రీ కామః సతతం జపేత్" అను శ్రీసూక్త వాక్యము మనకందరకు తెలిసినదే! శ్రీ శంకర భగవత్పాదులు కూడ లోకకళ్యాణార్థమై ముముక్షు లోకమునకు "గేయం గీతా - నామ సహస్రం” అని సందేశము నిచ్చినారు. జీర్ణోద్ధరణకై పాడదగిన గ్రంథ ములు 1. భగవద్గీత 2. శ్రీ విష్ణు సహస్రనామము అని ఈ వాక్యమున కర్థము, గీత భగవంతుని బోధరూపమగు తత్వము కాగా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము భగవంతుని స్వరూపము. మరొక మాటలో చెప్పవలెననిన గీత " వాచ్యము”; సహస్రనామము—“వాచకము” " వాచ్య వాచకయోః అభేదః" అను న్యాయమును బట్టి గీతయును, సహస్రనామమును ఒక్కటియే అని తేలింది. భగవన్నామ కీర్తనము నకు కాలపు కట్టుబాటు కాదనియు, అది సర్వముఖ ప్రణాళిక మరియు, ఆ నామమునందు భగవంతుని శక్తి అంతీయ నికిప్తమై ఉన్నదనియు, కలియుగమైన దానికి మించిన గతి మరినాటకటి ఏదియు లేదనియు