ఈ దేవీ మాహాత్మ్యము అంతా పవిత్రావసరాలలో, ముఖ్యంగా దుర్గాపూజా దినాలలో, పారాయణ చేయబడుతుంది. పారాయణం చేయగోరే భక్తుల ఉపయోగార్థం ఇందులో చండికాధ్యానమ్, అర్గలాస్తోత్రమ్, కీలకస్తోత్రమ్, దేవీకవచమ్, దేవీసూక్తమ్, రాత్రీ సూక్తమ్, అపరాధక్షమాపణ స్తోత్రమ్ చేర్చబడి ఉన్నాయి. పారాయణం చేసేవారు ఈ గ్రంథమంతా మొదటి నుంచి చివరివరకూ పఠించాలి.
మహామాయ (ఆద్యశక్తి) తన మహాకాళీ (తామసిక) స్వరూపంతో మధుకైటభ వధకు తోడ్పడడం ఈ గ్రంథపు ప్రథమ చరిత్రము నందు (1వ అధ్యాయం), మహాలక్ష్మీ (రాజసిక) స్వరూపంలో మహిషాసురుణ్ణి వధించడం మధ్యమ చరిత్రములో (2 మొదలు 4 అధ్యాయాలు), మహాసరస్వతీ (సాత్త్విక) స్వరూపంతో శుంభనిశుభాసురులను వధించడం ఉత్తర చరిత్రములో (5 మొదలు 13 అధ్యాయాలు) వర్ణింపబడి ఉంది.
ఈ దేవీ మాహాత్మ్యాన్ని శ్రద్ధతో పారాయణం చేసే వారికి శ్రీ జగన్మాతృ కృపాకటాక్ష వీక్షణం ప్రసాదించబడుగాక అని ప్రార్థిస్తున్నాం.
దేవి మహత్యము శ్రీ చండీ నవశతి నవాంగవిది.Telugu PDF