కుమార శతకము|Kumara satakam Telugu Book Download
శ్రీ కుమారశతకము సంస్కృతములో రావు భాస్కరరావు చేత రచింపబడి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి చేత ఆంధ్రీకరించబడింది. ఇది 1900 ఆగస్టు 1వ తేదీన కోలంక వీరవరం జమీందారిణి రాజా చెల్లయ్యమ్మ రావుబహద్దూరు ఆజ్ఞానుసారం మద్రాసు లారెన్స్ అసైలమ్ ప్రెస్సులో క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రిగారిచే ముద్రించబడింది. ఈ శతకంలో 101 శ్లోకాలు, ప్రతి శ్లోకానికి వెనువెంటనే ఆంధ్రీకృతపద్యము ఉన్నాయి. రావు వంశపు కులవృద్ధుడైన రావు భాస్కరరావు పిఠాపురం మహారాజా రావువేంకటకుమార మహీపతి సూర్యారావును ఉద్దేశించి రాజనీతిని బోధించిన శతకము ఇది. రావు వంశపుటౌన్నత్యము, మహారాజా వారి మాతృపితృ నగర మహిమ, మహారాజా వారి విద్వత్తు మొదలైన విషయాలు ఈ శతకంలో పొందుపరచబడి ఉంది. "కుమార!" అనేది ఈ శతకానికి మకుటంగా ఉంది.