వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జనవరి 4వ తేదీ నుండి ఈ కేంద్రాల్లో మాత్రమే జారీ|Reduce The SSD Tokens Issuing Centres

Reduce The SSD Tokens Issuing Centres

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జనవరి 4వ తేదీ నుండి ఈ కేంద్రాల్లో మాత్రమే జారీ|Reduce The SSD Tokens Issuing Centres 

 వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జారీ కేంద్రాల కుదింపు

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి గాను తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో టోకెన్లు జారీ చేస్తున్న విషయం విదితమే.

జనవరి 4వ తేదీ బుధవారం నుండి నాలుగు కేంద్రాల్లో మాత్రమే ఈ టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గల 2వ సత్రం (గోవిందరాజస్వామి సత్రాలు )కేంద్రాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

TTD has decided to reduce the SSD tokens issuing centres from 09 to 04 from January 4 onwards.

Henceforth the centres at Bhudevi Complex, Vishnu Nivasam, Srinivasam and Govindarajaswamy Choultries only.

The devotees are requested to make note of this.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

Comments